Mar 12, 2012

మహిళాదినోత్సవం-AN ARTICLE FROM Dr.KESIRAJU RAMPRASAD

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఉండి మార్కిటింగ్ యార్డ్ లో మహిళా సాధికారత సభ జరిగింది.

ఈ సభకు వి.వి.శివరామరాజు శాసన సభ్యులు అధ్యక్షత వహించారు.

యత్ర నార్యంతు పూజ్యతే తత్ర దేవోభవ

మహిళాదినోత్సవం ఏర్పడటానికి కారణం


•మార్చి 8 న 1857 లో న్యూయార్క్ నగరంలో బట్టల మిల్లులో పనిచేస్తున్న మహిళలు మొదటసారిగా వారి వేతన సమస్యల ఫై, పని వాతావరణం ఫై ఉద్యమం చేసారు.
•మార్చి 8 న 1908 లో 15000 మంది మహిళలు అమెరికా లోని న్యూయార్క్ నగరం లో వోటు హక్కు గురుంచి, మంచి వేతనాలు గురుంచి, బ్రెడ్ అండ్ రొజెస్ అనే స్లోగన్ తో ఉద్యమం చేసారు. బ్రెడ్ అనే పదం లో ఆకలి, రొజెస్ అనే పదం లో మంచి జీవనవిధానం గురుంచి నినదించారు.
•1910 లో మొదటసారిగా డెన్మార్క్ లోని కోపెన్ హెగాన్ లో క్లార జెట్కిన్ నాయకత్వంలో 100 మంది మహిళలు 17 దేశాల నుంచి హాజరయ్యు,వోటు హక్కు గురుంచి,లింగ వివక్షత ఫై పెద్ద రేలి నిర్వహించారు.
•1913 నుంచి రష్యా లో,1922 నుంచి చైనాలో, 1936 నుంచి స్పెయిన్ లో ప్రారంభం అయ్యి ప్రపంచ దేశాల అన్నిటిలో జరుగుతున్నది.
•ప్రారంభంలో ఈ మహిళా దినాన్ని పిబ్రవరి చివరి ఆదివారం జరుపుకొనేవారు. మరికొన్ని దేశాలలో వివిధ రోజులలో జరుపుకొనేవారు.
•1977 లో U .N .O మార్చి 8 నే ప్రపంచం అంతా ఈ రోజునే ఈ కార్యక్రమం నిర్వహించుకోవాలని పిలుపునిచ్చింది.అప్పటినుండి మార్చ్ 8 నే నిర్వహించు కోవడం ఆనవాయితీగా వచ్చింది.
•ఈ 2012 ని మహిళల సాధికారత మరియు వారిని ఆకలి,పేదరికం నుంచి పైకి తీసుకురావాలని పిలుపునిచ్చింది.
•ఈ రోజుని ప్రపంచ వర్కింగ్ వుమెన్ డే పరిగణిస్తారు.
•చాల దేశాలలో ఈ రోజుని వారికీ సెలవు దినంగా పరిగణిస్తారు.

చరిత్ర
ఋగ్వేద కాలంలో మహిళ లకు ప్రముఖ స్తానం ఉంది. మహిళలు బాగా చదువుకొన్నారు. స్వయంవరం ద్వారా తమ భర్తలను ఎన్నుకోనేవారు. మైత్రేయి ,గార్గి లాంటి చదువుకొన్న మహిళలు ఉండే వారు.పతంజలి,కాత్యాయన లాంటి వ్యాకరణకారులు ఆ కాలంలో మహిళలు బాగా చదువు కొన్నారని తెలిపారు. 500 BC వేదిక్ కాలంలో భారతీయ మహిళల కు మగవారితో సమానమైన హక్కులు,సముచిత స్తానం ఉండేది. తరువాత కాలంలో వారి స్తానం తగ్గుతూ వచ్చింది.

మిడివల్ పిరియడ్ లో సతి,బాల్య వివాహాలు,వితంతు వివాహలపై నిషేధం, పరదా పద్దతి, దేవదాసి వ్యవస్థ,

చదువు పై ఆంక్షలు పెరిగాయి.

ఆ కాలంలోనే రజియ సుల్తానా, రాణి దుర్గావతి, చాంద్ బిబి, నూర్జహాన్, జహానార్ మరియు జేబున్నీస లాంటి కవయుత్రులు,జిజియ బాయ్ లాంటి తల్లులు, మీరాబాయి లాంటి భక్తురాలు,అక్క మహాదేవి,రాణి జనాబాయి లాంటి వారు ఉన్నారు.

సిక్కు గురువులు మహిళల కు మగవారితో సమానమైన హక్కులు ఇవ్వాలని చెప్పారు.

బ్రిటిష్ కాలంలో రాజారామమోహన్ రాయ్, ఈశ్వరచంద్ర విద్యాసాగర్, జ్యోతిరావు పూలే లాంటి సంస్కరణవాదులు మహిళల కోసం ఎన్నో ఉద్యమాలు చేసారు. చరణ్ సర్కార్ 1847 లో కలకత్తా లోని బరసత్ లో బాలికలకు ఉచిత విద్యాలయం ప్రారంబించారు. తరవాత కాలంలో దేని పేరు కాలిక్రిష్ణ గరల్స్ హైస్కూల్ గా మార్చారు. పండిత రమాబాయి మహిళల సమస్యల పై ఉద్యమించారు.

కిట్టురు చెన్నమ్మ, రాణి లక్ష్మిబాయి, బేగం హజరత్ మహల్ లాంటి వారు బ్రిటిష్ వారిపై పోరాడారు.

చంద్రముఖి భాసు, కదంబని గంగూలి, అనంది గోపాల్ జోషి లాంటి వారు ఆ రోజులలోనే డిగ్రీ లు సంపాదించారు.

లేడీ కామా, అనిబెసెంట్,ప్రీతి లతా వాడేదర్, విజయలక్ష్మి పండిట్, రాజకుమారి అమృత కౌర్, అరుణ అసఫాలి, సుచేత కృపలానీ, కస్తూరిబా గాంధీ, లక్ష్మిసేహగాల్, సరోజినీ నాయుడు,దుర్గాబాయి దేశ్ ముఖ్ లాంటి ఎందరో వనితలు స్వతంత్ర ఉద్యమం లో పాల్గొన్నారు.

స్వాత్రంత్యం తర్వాత మహిళలు ఎన్నో పోరాటాలు చేసి ఎన్నో హక్కులు సాదించుకొన్నారు.


సవాళ్ళు


•భారతీయ మహిళలు ఎన్నో అవాంతరాలను ఎదుర్కొని విద్య, ఉపాధి రంగాలలో ముందంజలో ఉన్నారు.
•అన్ని రంగాలలో మగవారితో పోటి పడి ముందు వరసలోకి వస్తున్నారు.
• బస్సులు, ఆటోలు, రైయుళ్లు,విమానాలు కూడా నడపగలుగుతున్నారు.
•పాల సహకార సంఘాలు, స్వయం సహాయక సంఘాలు,పంచాయతీలు, మండలాలు,జిల్లా పరిషద్ ల నిర్వహణలో, పాలనలో ప్రావీణ్యం సంపాదించారు.
•రాష్ట్ర ముఖ్యమంత్రులు గా ప్రతిభ చూపుతున్నారు.
•నలబయ్ శాతం కన్నా ఎక్కవ సీట్స్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ లో నెగ్గారు.
•దేశంలో ఇప్పటికి సగం మందికి మరుగుదొడ్డి సౌకర్యం లేకపోవడం విచారకరం.
•లింగ నిష్పతిలో అసమానతలు కొనసాగుతున్నాయి.ప్రతి 1000 మంది బాలురకు 914 మంది బాలికలే ఉన్నారు.
•దేశంలో సర్వికల్ కాన్సర్ తో భాదపడే వారి సంఖ్య ఎక్కువగావుంది.
•ఎన్నో బ్యాంకులు ,ఇన్సూరెన్స్ కంపెనీల,వ్యాపారం సంస్థల నిర్యహణలో ముందంజలో ఉన్నారు.
•కుటుంబం, ఇంటి భాద్యతలు వాళ్ళ చాల మంది మహిళలు పనిలో మరింత భాద్యతలు నిర్వహించలేకపోతున్నారు.  

మహిళలు వ్యాపార రంగం లోకి రాక పోవడానికి కారణాలు 

1.వారిమీద వారికీ నమ్మకం లేకపోవడం
2.సాంఘిక మరియు సాంస్కృతిక అవరోథాలు
3.వ్యాపార మరియు మార్కెట్ రంగ రిస్క్ లు తీసుకోవడానికి సిద్దంగా ఉండకపోవడం
4.కంఫర్ట్ జోన్ లోనే వ్యాపారం చేయాలనుకోవడం
5.వ్యాపార ప్రేరణ తక్కువ ఉండటం
6.సొంతంగా వ్యాపారం చేయాలనే దృక్పధం ఉండకపోవటం
7. తల్లితండ్రులు చేసే కుటుంబ వ్యాపారాలు పట్ల అబిలాష చూపకపోవడం.
8.వ్యాపార నిర్వహణ జ్జానాలు, నైపుణ్యాలు సంపాదించుకోకపోవడం
9.పెట్టుబడి సమకూర్చుకోవడం లో నిపుణత లేకపోవడం
10.వ్యాపార నిర్వహణ శిక్షణ శిబిరాలకు వెళ్లకపోవడం
11.నూతన వ్యాపార అవకాశాలను గుర్తించ లేకపోవడం.
12.ఎగుమతుల మరియు దిగుమతుల వ్యాపార అవకాశాలు, టూరిసం రంగం, ప్లాస్టిక్, సోలార్, హెర్బల్ అండ్ హెల్త్ కేర్, ఫుడ్ మరియు కూరగాయలు ప్రోసెస్సింగ్ యూనిట్స్ లాంటి ఇతర రంగాల పై అవగాహనలేకపోవడం
13.డిగ్రీ లేక వృతి శిక్షణ కళాశాలలో సరియిన మార్గదర్సికత్వం అందించే గురువులు లేక మెంటార్సు లేకపోవడం.
14.తల్లితండ్రుల నుంచి సరియిన సహకారం లేకపోవడం

ఫై కారణాలు వల్లే కాకుండా ఇతర కారణాలవల్ల మహిళలు వ్యాపార రంగంలో అనుకున్నవిధంగా అబివృది చెందలేకపోతున్నారు.
         

ముదితల్ నేర్వగరాని విద్య గలదే ముద్దాడి నేర్పింపగన్
Dr.Kesiraju Ramprasad
Educational Psychologist
CO-ORDINATOR
SIVA SWACHANDA SEVA SAMSTHA

No comments:

Post a Comment

Addressing gathering in Chambers college,Plalkolk in Jawahar Knowledge centre